- రాజ్యాంగం అమలులోనికి వచ్చిన 26 సం,రాల తర్వాత 1976 లో 42 రాజ్యాంగ సవరణ ద్వార 51(A) లో పోందుపర్చారు.
- వీటిని స్వరణ్ సింగ్ కమిటీ సిఫారస్ మేరకు రష్యా రాజ్యాంగం నుండి గ్రహించారు.
భారతదేశంలో ప్రతి పౌరునికి గల
ప్రాధమిక విధులు :
- భారత రాజ్యాంగాన్ని గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను.
- భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి.
- భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను.
- అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశానికి సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను.
- భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ
గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీలను
గౌరవించవలెను.
- మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ మరియు అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను.
- ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను మరియు వన్యప్రాణులను మరియు ఇతర జీవులను సంరక్షించుకొనవలెను.
- శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను.
- ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను. హింసను విడనాడవలెను.
- భారతదేశం అభివృద్ధి చెందునట్లు, వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా
మిశ్రమంగానూ పాటుపడుతూ, దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, దానిని
సాధించుటకు కృషిచేయవలెను.
2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడినది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది.
No comments:
Post a Comment